Telugu - Gurram Jashuva Jayanthi

 

Gurram Jashuva Jayanthi Report

Name of the activity                      :         Jashuva Jayanthi

Department                                    :         Telugu

Date                                                     : 28-09-2024

No. of Staff participated              :         10

No. of Students Participated     :   65

Aim

To commemorate the life, works and legacy of Gurram Jashuva, a renowned Telugu poet, and to promote Telugu literature and culture.

Objectives

1. Literary Awareness: Create awareness about Nashua’s literary contributions and impact on Telugu literature.

2. Cultural Preservation: Preserve and promote Telugu culture, traditions, and heritage.

3. Inspiration: Motivate young generations to appreciate and engage with Telugu literature.

4. Education: Educate people about Jashuva's life, works, and significance.

Outcomes

1. Enhanced literary appreciation: Deeper understanding of Jashuva's poetry and its relevance.

2. Cultural enrichment: Appreciation for Telugu culture and traditions.

3. Inspired youth: Motivated young writers and poets.

4. Preservation of heritage: Documentation and preservation of Jashuva's works.

 

గుర్రం జాషువా జయంతి వేడుక లక్ష్యం (AIMS):

మహాకవి గుర్రం జాషువా తన రచనల ద్వారా తెలుగు సాహిత్యానికి, కవిత్వానికి చేసిన సేవను స్మరించుకోవడం వలన తెలుగు సాహిత్య విశిష్టత తెలుసుకోవడంతో పాటు, సామాజిక సవాళ్ళను ఆయన ప్రశ్నించిన విధానం, సమానత్వం, న్యాయం, మానవతా విలువలను ప్రోత్సహించే అంశాలను ఆయన రచనల ద్వారా చేసిన కృషిని  ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు, కొత్త తరాల సాహిత్య ప్రియులకు, కవులకు ఆయన రచనలు, భావజాలం చేరువయ్యేలా చేయడం.

గుర్రం జాషువా జయంతి వేడుక  ఉద్దేశ్యం (OBJECTIVES):

గుర్రం జాషువా జయంతి వేడుక ఉద్దేశ్యం ఆయన సాహిత్య సేవలను స్మరించుకుంటూ సమాజంలో సామాజిక న్యాయం, సమానత్వం, మానవతా విలువలను ప్రోత్సహించడం. ఆయన రచనలు మరియు సందేశాలు భవిష్యత్ తరాలకి స్ఫూర్తి కలిగించేలా చేయడం ద్వారా వివక్షను నిరసించటంలో, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడటంలో ఉన్న ప్రాముఖ్యతను తెలియజేయడమే ఈ వేడుక ప్రధాన ఉద్దేశం.

 

మహాకవి గుర్రం జాషువా జయంతి వేడుకలు కళాశాలలో అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో గుర్రం జాషువా గారి కవిత్వం, సమాజంపై వారి రచనల  ప్రభావం, కుల వివక్ష వ్యతిరేక పోరాటం వంటి అంశాలను గుర్తుచేసుకుంటూ, విద్యార్థులకు స్ఫూర్తి కలిగించేలా వివిధ కార్యక్రమాలు జరిగాయి.

కార్యక్రమం ఆరంభంలో కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ శ్రీ ఎం. మల్లేశ్వర రావు గారు మరియు అధ్యాపకులు  అతిథులు కలిసి  జాషువా గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం,సభాధ్యక్షులు  తన ప్రసంగంలో గుర్రం జాషువా గారి కవిత్వంలోని సామాజిక చైతన్యం, సాహిత్యంలోని మానవత్వపు సందేశాలను వివరిస్తూ, ఆయన అనుభవాలను ప్రస్తావించారు.

జాషువా గారు తన రచనల ద్వారా సమాజంలోని అన్యాయాలను, కుల వివక్షను ధైర్యంగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆయన ప్రసిద్ధ రచన "గబ్బిలం" నుండి పాఠాలు పఠించారు. "చిక్కిన కాసుచే తనివి చెందు నమాయకుడెల్ల కష్టముల్’’  వంటి ప్రముఖపద్యాల  ద్వారా, ఆయన సామాజిక సమస్యల  గురించి చర్చ జరిగింది. ఇందులో విద్యార్థులు జాషువా గారి రచనలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. విద్యార్థులు జాషువా గారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, సమాజంలో మార్పులు తీసుకురావాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు.

ఈ విధంగా, గుర్రం జాషువా గారి జయంతి వేడుకలు విజయవంతంగా ముగిశాయి. కార్యక్రమం చివర్లో, ఆయన మార్గంలో సాగాలని, సమానత్వం కోసం కృషి చేయాలని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేశారు.

 

గుర్రం జాషువా జయంతి వేడుక  ఫలితం (OUTCOMES):

గుర్రం జాషువా జయంతి వేడుక ఫలితంగా ఆయన సాహిత్యం, సామాజిక సందేశాలు మరింత ప్రజల్లోకి చేరతాయి. సమానత్వం, సామాజిక న్యాయం, మానవత్వం వంటి విలువలను ప్రజల్లో రగిలించడంలో ఈ వేడుకల ద్వారా స్ఫూర్తి లభిస్తుంది. అలాగే, జాషువా గారి సాహిత్యంపై అవగాహన పెరుగుతూ, యువతలో సామాజిక చైతన్యం కలగడం, సాహిత్యంపట్ల ఆసక్తి పెరగడం వంటి ఫలితాలు కనిపిస్తాయి.








ధన్యవాదములు

నిర్వాహకులు

డా. జి. శ్రీనివాస రావు

తెలుగు విభాగం

ప్రభుత్వ డిగ్రీ కళాశాల

 కామవరపుకోట


 

Comments

Popular posts from this blog

Commerce - Profile

Department of Economics, Departmental Profile